వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్పై ప్రధానికి సిపిఐ ఫిర్యాదు
హైదరాబాద్: టిఆర్ఎస్ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖరరావుకు తన మంత్రిత్వ శాఖ విధులను పట్టించుకోవడం లేదని, ఆయనకు కార్మికుల సమస్యలు పట్టడం లేదని సిపిఐ సీనియర్ నాయకుడు, ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్ గుప్తా శనివారం హైదరాబాద్లో ఆరోపించారు. కెసిఆర్కు తెలంగాణ రాష్ట్రం తప్ప తన శాఖ విషయాలు పట్టడం లేదని ఆయన విమర్శించారు. కార్మిక సంఘాలతో ఆయన ఒక్కసారి కూడా సమావేశం కాలేదని అన్నారు. ఖాళీగా కూర్చోవడం మినహా ఆయనకు ఢిల్లీలో పనేంలేదని, ఆయన తీరుపై ప్రధాని మన్మోహన్ సింగ్కు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, June 24, 2006, 23:53 [IST]