వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జ్వరపీడితులు 52 వేలు మాత్రమే: రోశయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో 52 వేల మందికి మాత్రమే జ్వరాలు, సోకాయని అందులో చికున్ గన్యా రోగులు అతి స్వల్పమని రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలియజేసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అతిసార, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి రోశయ్య చెప్పారు. విషజ్వరాల వ్యాప్తిపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. విష జ్వరాలపై ప్రతిపక్ష తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. చికున్ గన్యా వ్యాధి సోకినప్పుడు వెంటనే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఐవి సుబ్బారావు చెప్పారు.
Comments
Story first published: Saturday, June 24, 2006, 23:53 [IST]