ఇసి సమావేశంలో పరస్సర ఆరోపణలు, రసాభాస
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల కమీషన్ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలుగుదేశం విమర్శలను ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి తోసిపుచ్చారు. పంచాయతీ ఎన్నికలపై ఎన్నికల కమీషన్ సోమవారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ అక్రమాలను ఎన్నికల కమీషన్ అడ్డుకోకపోవడం దారుణమని తెలుగుదేశం నాయకుడు విజయరామారావు అన్నారు. ఆయన విమర్శలను కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పెద్ద పెట్టున వ్యతిరేకించారు. మీడియా సమక్షంలోనే సమావేశం ఏర్పాటు చేయాలన్న తెలుగుదేశం డిమాండ్ను ఎన్నికల కమీషన్ వ్యతిరేకించింది. మీడియా ప్రతినిధులను బయటకు పంపించివేశారు. ఆ తర్వాత గదికి తాళం కూడా వేశారు. గెలవలేకనే తమపనై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.