హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకటేశ్వరరావుతో హైదరాబాద్‌కు పోలీసులు

By Super Admin
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డిపాజిటర్లను మోసగించి పరారైన కృషి బ్యాంక్‌ చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావును సిఐడి పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. డిపాజిటర్లకు 32 కోట్ల రూపాయల మేరకు ఎగనామం పెట్టి వెంకటేశ్వరరావు పరారయ్యాడు. వెంకటేశ్వరరావును థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో తీసుకుని పోలీసులు హైదరాబాద్‌కు బయలుదేరారు.

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇమిగ్రేషన్‌ పోలీసులు వెంకటేశ్వరరావును విమానాశ్రయంలో అప్పగించారు. అనంతరం ఆయనను సిఐడి పోలీసులకు అప్పగించారు. సిఐడి పోలీసులు వెంకటేశ్వరరావును తీసుకొని మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బ్యాంకాక్‌ నుంచి బయలుదేరారు. కొసరాజు వెంకటేశ్వరరావు ఈ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు చేరుకుంటాడు. బోగస్‌ పాస్‌పోర్టుతో పోలీసులకు చిక్కి బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2001 ఆగస్టు 13వ తేదీన కృషి బ్యాంక్‌ మూతపడింది. అప్పటి నుంచి వేంకటేశ్వరరావు పరారీలో వున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X