వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యక్తిగత కక్షతోనే ఐలయ్యను చంపాం: నిందితులు
వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు కాంగ్రెస్ జడ్పిటిసి తిరుగుబాటు అభ్యర్థి కంచె ఐలయ్యను వ్యక్తిగత కక్షతోనే చంపామని పోలీసులకు లొంగిపోయిన నిందితులు చెప్పారు. కంచె ఐలయ్య హత్యపై సోమవారం గూడూరు అట్టుడికిన విషయం తెలిసిందే. కంచె ఐలయ్య హత్యకు రాజకీయాలతో సంబంధం లేదని నిందితులు చెప్పారు. కత్తి వెంకన్నతోపాటు ముగ్గురు నిందితులు మంగళవారం వరంగల్ జిల్లా తొర్రూరు పోలీసుల ముందు లొంగిపోయారు.
ఒక కాంట్రాక్టు విషయంలో ఐలయ్యను చంపామని వారు చెప్పారు. ఐలయ్య హత్యతో దొంతి మాధవరెడ్డికి సంబంధం లేదని వారు చెప్పారు.
Comments
Story first published: Tuesday, June 27, 2006, 23:53 [IST]