కాంగ్రెస్కు మేమే ప్రత్యామ్నాయం: నరేంద్ర
హైదరాబాద్: భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత తమదే పెద్ద పార్టీ అని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అవుతామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్తో తమకు పొత్తులుండవని, విడిగా తాము బలపడి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వుంటామని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, తాము ఉమ్మడిగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చేరాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తమను ఆహ్వానించారని, ఈ ఆహ్వానంపై పార్టీ పరిశీలించలేదని, ప్రస్తుతం ఆ దిశగా ఆలోచన సాగడం లేదని ఆయన అన్నారు.