వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లగొండ జిల్లాలో మహిళ దారుణ హత్య
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లె గ్రామంలో 50 మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఓటు వేసి తిరిగి వెళ్తున్న పది నిమిషాలకే ఆ మహిళను ఆగంతకులు కర్రతో తలపై కొట్టి చంపి పరారయ్యారు. ఆమెకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని, అందువల్ల అది రాజకీయ హత్య కాదని పోలీసులు అంటున్నారు.
నర్సమ్మ అనే ఆ మహిళను పాత కక్షలతోనే హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను గుర్తించే ప్రయత్నంలో పడ్డారు.
Comments
Story first published: Wednesday, June 28, 2006, 23:53 [IST]