వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కాపురంలో టిడిపి విధ్వంసం: బలరాం అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారంనాడు విధ్వంసానికి దిగారు. టిడిపి కార్యకర్తలు వీధుల్లో తిరుగుతూ బస్సులను, దుకాణాలను ధ్వంసం చేశారు. వీరి దాడిలో 20కి పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం బలరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మార్కాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ప్రకాశం జిల్లా ఎర్రగొండిపాలెం మండలంలో పోలింగ్‌ సందర్భంగా బుధవారం అదుపులోకి తీసుకున్న తమ నాయకులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో టిడిపి కార్యకర్తలు పోలీసులపైకి తిరగబడ్డారు. అనంతరం మార్కాపురం వీధుల్లో తిరుగుతూ విధ్వంసం సృష్టించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X