వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో పట్టపగలు వ్యాపారి హత్య
విశాఖపట్నం: విశాఖపట్నంలో గురువారం పట్టపగలే ఓ వ్యాపారి హత్య జరిగింది. బైక్పై వచ్చిన దుండగులు సత్యనారాయణ అనే వ్యాపారిని కాల్చి పారిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే సత్యనారాయణ మరణించారు. తక్కు వ్యాపారం చేసే సత్యనారాయణ కాంట్రాక్టులు కూడా చేస్తుంటారు.
సత్యనారాయణ కరాచీలో ఓ ఇల్లు నిర్మిస్తున్నాడు. ఇదే సత్యనారాయణను హత్య చేయడానికి కారణమై వుండవచ్చునని భావిస్తున్నారు. భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో సత్యనారాయణ రైల్వే కాంట్రాక్టులు చేస్తుంటారని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Story first published: Thursday, June 29, 2006, 23:53 [IST]