వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిపియం వైఖరి వల్లనే ఎడబాటు: సిపిఐ
హైదరాబాద్: సిపియం వైఖరి వల్లనే వామపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 23 ఏళ్ల తర్వాత వామపక్షాలు విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో కలిసి ఎలా పోటీ చేస్తారని ఆయన సిపియంను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి సిపియం పోటీ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, June 29, 2006, 23:53 [IST]