కృషి స్కామ్లో ఎవరినీ వదలం: జానారెడ్డి
హైదరాబాద్: డిపాజిటర్లను మోసగించిన కృషి బ్యాంక్ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టబోమని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావును బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు తీసుకురావడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కృషి బ్యాంక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వెంకటేశ్వరరావు బినామీ ఆస్తులను గుర్తించడం తమ ముందున్న పని అని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావును విచారించే నిమిత్తం కోర్టు అనుమతి కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కేసును దర్యాప్తు చేయడం, డిపాజిటర్లకు సొమ్మును ఇప్పించడం అనే రెండు పనులు జరగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దాని కోసమే తాము కృషి చేస్తున్నామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ మీడియా ప్రతినిధులతో అన్నారు.