వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్థానిక ఎన్నికల్లో విజయం మాదే: కెకె
విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము అఖండ విజయం సాధిస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విశాఖపట్నంలో జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని, తమ అంచనాలు నిజమవుతాయని ఆయన అన్నారు. తాము అధికార వికేంద్రీకరణకు సిద్ధంగా వున్నామని, స్థానిక సంస్థలకు తాము అధికారాలు బదలాయిస్తామని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, June 30, 2006, 23:53 [IST]