వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు: ఇద్దరు మృతి
హైదరాబాద్: విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బలయ్యారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వర్షం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం కాస్తా తెరిపినివ్వడంతో ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. శ్రీకాకళం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల్లో హింస చెలరేగింది. వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, మహబూబాబాద్, తాడ్వాయి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది.
Comments
Story first published: Sunday, July 2, 2006, 23:53 [IST]