వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గత తప్పులకు బాబు అనుభవిస్తున్నారు: మణిశంకర్
న్యూఢిల్లీ: గతంలో చేసిన తప్పిదాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వ్యవహారాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదని, ఇది చంద్రబాబు, ఆయన మిత్రుల నిర్వాకం వల్లనే జరిగిందని మణిశంకర్ అయ్యర్ ఆదివారంనాడు మీడియాతో అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమీషన్లను కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తేవడానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన ప్రతిపాదనను చంద్రబాబు, ఆయన పార్టీ వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని 64వ సవరణను తెచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మిత్రులు అందుకు బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమీషన్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి కుదరదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, July 2, 2006, 23:53 [IST]