వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసుల ఎన్నికల బీట్ భేష్: జానా కితాబు
తిరుపతి: పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు సమర్థంగా వ్యవహరించారని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎంతో సంయమనంతో వ్యహరించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, దీన్ని బట్టే పోలీసులు ఎంత సంయమనంతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
సోమవారం జరిగిన రీపోలింగ్ను బట్టే ఎన్నికలను ఎంత సమర్థంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ వారు రెచ్చిపోయి ఘర్షణలు సృష్టించారని ఆయన అన్నారు. ఈ విషయాలన్ని తెలిసి కూడా మీడియా, ప్రజలు అర్థం చేసుకోకపోవడం మంచిది కాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, July 3, 2006, 23:53 [IST]