వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిపియం నేత కొరటాల సత్యనారాయణ అంత్యక్రియలు
హైదరాబాద్: సిపియం సీనియర్ నాయకుడు కొరటాల సత్యనారాయణ భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్లోని బన్సీలాల్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు సిపియం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, ఇతర సిపియం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
కొరటాల సత్యనారాయణ భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర శ్రద్ధాంజలి ఘటించారు. కొరటాల సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి బిజెపి అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యనారాయణ సిద్ధాంతానికి కట్టుబడి పని చేసిన నాయకుడని, అది ఎంతో గౌరవించదగిన అంశమని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, July 3, 2006, 23:53 [IST]