వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫలితాలు అనుకున్నట్లే ఉన్నాయి: వైయస్
హైదరాబాద్: తాము అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీకి తాము చెప్పినట్లుగానే 30 శాతానికి మంచి జడ్పిటిసీ స్థానాలు రావడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎక్కడో ఒక చోట ఇబ్బంది ఉంటే ఉండవచ్చునని, మొత్తంగా తాము చెప్పిన విధంగానే ఫలితాలు ఉంటున్నాయని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి తాము 70 శాతానికి పైగా జడ్పిటిసిలను కైవసం చేసుకుంటున్నామని ఆయన అన్నారు. తెలుగుదేశం కూటమికి పది, 20, 30 స్థానాలు వస్తాయని చెప్పామని, ఇప్పుడు 30 శాతం లోపే వస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల పుంజుకున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పూర్తి ఫలితాలు రానీయండని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, July 4, 2006, 23:53 [IST]