వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమి స్కామ్‌లో సియం సలహాదారు: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వేయి కోట్ల రూపాయల విలువ చేసే భూకుంభకోణం వెనక ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి సలహాదారుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కుంభకోణంపై వివరణ ఇవ్వాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా పొప్పాల్‌గుడా గ్రామంలోని 240 ఎకరాల భూమిని కాందిశీకులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఆ వివరణ డిమాండ్‌ చేశారు. ఈ భూములను ఆర్‌పి మలానీతో పాటు ఏడుగురికి ఇవ్వాలనే రెవెన్యూ శాఖ కార్యదర్శి రోశయ్య తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయాలని ప్రభుత్వం అనుకోవడమనేది కూడా ఒక నాటకమని ఆయన అన్నారు.

తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ వ్యవహారం పెద్ద విషయంగా ముందుకు వచ్చిందని, ఆ సమయంలో అందుకు బాధ్యుడైన అధికారిని తాము సస్పెండ్‌ చేశామని, దానికి తోడు ఆ భూములను రక్షించామని ఆయన చెప్పారు. తాము రక్షించిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ఇష్టారాజ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆయన అన్నారు. కోట్లాది రూపాయల భూములను ఉద్దేశ్యపూర్వకంగానే అన్యాక్రాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X