వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద తగ్గుముఖం: కోలుకోని గ్రామాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నాగావళి, వంశధార, తదితర నదుల్లో వరద ఉధృతి తగ్గినప్పటికీ ముంపు నుంచి చాలా ప్రాంతాలు బయటపడలేదు. ఒరిస్సాలో వర్షం తగ్గిపోవడంతో ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. విజయనగరం జిల్లాలోని వేలాది ఎకరాల పంట పొలాలు, జనావాసాలు జలమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వరద తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని గ్రామాలు ఇంకా జలం మధ్యనే ఉన్నాయి. బాధితులకు సహాయం సరిగా అందడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని కామర్తి గ్రామంలో నీరు తగ్గలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు రాస్తారోకో చేశారు.

ఇదిలావుంటే, తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు వరద ప్రమాదం ముంచుకొచ్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగ, తదితర నదులు పొంగిపొర్లుతున్నయి. సిర్పూర్‌, కౌటాలకు మధ్య గల రోడ్డు జలమయమైంది. దీంతో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, కౌటాలలకు మధ్య రాకపోకలు స్తంభించాయి. పడవల్లో ప్రజలను చేరవేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X