వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు నెలల తర్వాత గల్ఫ్‌ నుంచి స్వదేశానికి శవం

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: గల్ఫ్‌లో మరణించిన ఒక వ్యక్తి శవం ఏడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. గల్ఫ్‌లోని రియాజ్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్బారాయుడు అనే వ్యక్తి గొర్రెల కాపరిగా పనిచేస్తూ వుండేవాడు. హఠాత్తుగా అతను మరణించినట్లు ఏడు నెలల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు భారత విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించారు. అతను మరణించిన విషయాన్ని విదేశాంగ శాఖ ధృవీకరించింది.

మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ అతని శవాన్ని భారత్‌కు తెప్పించేందుకు ఏ విధమైన ప్రయత్నాలు జరగలేదు. చివరకు ఇప్పుడు అతని శవం ఇక్కడికి చేరుకుంది. సుబ్బారాయుడు ఎలా మరణించాడనేది తెలియడం లేదు. ఇన్నాళ్ల తర్వాత అతని శవం ఇక్కడికి చేరుకోవడం మిస్టరీగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X