30 ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు: క్యాబినెట్
హైదరాబాద్: రాష్ట్రంలోని 30 ప్రభుత్వ రంగ సంస్కరణల్లో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంస్కరణలు చేపట్టే ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసి, సింగరేణి కూడా వున్నాయి. వచ్చే మూడేళ్ల లోగా ఈ సంస్కరణలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ చిట్ఫండ్స్ చట్టంలో మార్పులు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మదుపుదారులకు రక్షణ కల్పించే దిశలో చట్టంలో మార్పులు చేయాలని మంత్రివర్గం భావించింది.
15వేల కోట్ల రూపాయల కేంద్ర రైతు పథకానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మూడు కొత్త విశ్వవిద్యాలయాలకు 3 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. టిసిఐ టవర్స్కు హైదరాబాద్ సమీపంలోని నానక్రామ్ గూడాలో 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.