షారూఖ్ భవన నిర్మాణానికి సుప్రీం గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షారూఖ్ బహుళ అంతస్థుల నివాసభవనం నిర్మాణానికి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. ముబాయిలోని శివారు బంద్రాలో వారసత్వ సంపదకు పక్కనే షారూఖ్ ఖాన్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు డిస్మిస్ చేసింది. దీంతో తన నివాస భవనాన్ని నిర్మించుకోవడానికి షారూఖ్కు అడ్డంకులు తొలగిపోయాయి.
షారూఖ్ఖాన్ భవనాన్ని నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడాన్ని ఛీఫ్ జస్టిస్ వై.కె. సబర్వాల్, జస్టిస్ సి.కె. ఠక్కర్లతో కూడిన సుప్రీంకోర్టు సమర్థించింది. తన వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించి షారూఖ్ తన భవనానికి అనుమతి సంపాదించుకున్నారని ఆరోపిస్తూ సిరిల్ థామస్ మెక్వాన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇంతకు ముందు తోసిపుచ్చింది.