వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాంధీ ఆరో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్: మనస్థాపానికి గురైన ఒక వ్యక్తి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి భవనం ఆరవ అంతస్థు నుంచి దూకి ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిన గాయాలతో బేగంపేటకు చెందిన యాదగిరి భార్య బబిత ఆస్పత్రిలో చేరింది. గత నాలుగు రోజులుగా ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రమాద వశాత్తు గ్యాస్ స్టౌ మంటలు అంటుకుని బబిత గాయపడింది. అయితే బబిత సోదరులు బబితను అనుమానించడం మొదలుపెట్టి వేధించసాగారు. దీంతో యాదగిరి తీవ్ర మానస్థాపానికి గురయ్యాడు. దాంతో ఆదివారంనాడు గాంధీ ఆస్పత్రి భవనం ఆరో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Story first published: Saturday, July 8, 2006, 23:53 [IST]