వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ జిల్లాలోని ఆర్గానిక్ ఫ్యాక్టరీలో పేలుళ్లు
మెదక్: మెదక్ జిల్లా బొంతపల్లి వద్ద గల ఆర్గానిక్ ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లతో మంటలు వ్యాపించి ఫ్యాక్టరీ అంతటా విస్తరిస్తున్నాయి. బొంతపల్లి వద్ద గల మినార్ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో నాలుగు రియాక్టర్లు పేలి ఈ మంటలు లేచాయి. మంటలు వ్యాపిస్తుండడంతో మిగతా రియాక్టర్లు కూడా పేలిపోతాయేమోనని యాజమాన్యం అందోళన చెందుతోంది.
రియాక్టర్లు పేలి మంటలు లేవడం ప్రారంభం కాగానే సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఫ్యాక్టరీకి ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి వుంటుందని భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, July 8, 2006, 23:53 [IST]