వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిమ్స్‌లో విధులకు వేణుగోపాల్‌ హాజరు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి అణ్బుమని రాందాస్‌ అన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వేణుగోపాల్‌ శనివారం విధులకు హాజరయ్యారు. ఇది వేణుగోపాల్‌కు, తనకు మధ్య తలెత్తిన సమస్య కాదని ఆయన అన్నారు.

వ్యవహారాన్ని తమ ఇరువురి మధ్య సమస్యగా మీడియా సృష్టిస్తోందని, ఎయిమ్స్‌ పాలనా వ్యవహారాలు మారాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. వేణుగోపాల్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది తానొక్కడిని కాదని, పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యులు, విద్యార్థులు సమ్మె విరమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X