థాకరే భార్య విగ్రహానికి అవమానం: శివసేన విధ్వంసం
ముంబాయి: ముంబాయిలోని శివాజీ పార్కు సమీపంలోని దాదర్లో గుర్తు తెలియని వ్యక్తులు శివసేన అధినేత బాల్థాకరే సతీమణి స్వర్గీయ మీనాతాయ్ థాకరే విగ్రహాన్ని అవమానించడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. దీంతో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. దాదర్ ప్రాంతంలో శివసేన కార్యకర్తలు ఒక టూరిస్టు బస్సును దగ్ధం చేశారు. ట్రాఫిక్ను నిరోధించారు. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసు బలగాలు పెద్ద యెత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మీనాతాయ్ థాకరే గౌరవనీయమైన వారని, అందువల్ల ఆమె విగ్రహాన్ని అవమానించడం శివసైనికుల మనోభావాలను దెబ్బ తీసిందని శివసేన నాయకుడు మనోహర్ జోషీ అన్నారు. దాదర్ ప్రాంతంలో బంద్కు శివసేన కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే, పూణే, నాగపూర్, నాందేడ్లలో కూడా శివసేన సైనికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు శివసేన కార్యకర్తలను అరెస్టు చేశారు.