వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకోవాలి: వెంకయ్య
విశాఖపట్నం: కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పని చేసే విషయాన్ని ఆలోచిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆహార ధాన్యాల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సామవేశంలో చెప్పారు.
యుపిఎ భాగస్వామ్య పక్షాలు ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆయన విమర్శించారు. దేశంలో ఆహార ధాన్యాల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Sunday, July 9, 2006, 23:53 [IST]