వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూస్కామ్‌పై న్యాయపరమైన చర్యలు: ముఖ్యమంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పొప్పొలగూడ గ్రామంలోని భూమిని కాందిశీకులకు అప్పగించిన విషయమైన న్యాయపరమైన చర్యలన్నీ తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులన్నింటినీ కాపాడుతామని ఆయన అన్నారు. కాందిశీకులకు భూమి అప్పగింత వ్యవహారంలో తనకు ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన విమర్శను ఆయన ఖండించారు. ఈ భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కోర్టులో అప్పీలు చేస్తుందని తాము స్పష్టంగా చెప్పామని, అవసరమనుకుంటే ఇంప్లీడ్‌ కావచ్చునని తెలుగుదేశం పార్టీ నేతలకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను మరింత పటిష్టంచేసి, సమర్థంగా పని చేయించడానికే సంస్కరణలు చేపడుతున్నామని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందనే విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఆర్టీసి వంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. తాము అప్పులు తెచ్చి సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వంలో 60 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని, వాటితో అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదని, తాము అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X