అనంతలో కాంగ్రెస్ పాగా: ఖమ్మం కూడా కాంగ్రెస్దే
హైదరాబాద్: తెలుగుదేశం జడ్పిటిసి సభ్యులు ఇద్దరు ఫిరాయించడంతో అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్కు చెందిన టి. కవిత అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఎన్.పి. కుంట, బుక్కరాయసముద్రం జడ్పిటిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించారు. జిల్లా పరిషత్ సమావేశంలో వీరిద్దరూ కాంగ్రెస్ స్థానాల్లో కూర్చున్నారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్వారు జిల్లా కలెక్టర్తో వాగ్వివాదానికి దిగారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నకను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. దీంతో ఒక జిల్లా పరిషత్ తెలుగుదేశం పార్టీ నుంచి చేజారిపోయింది. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను మాత్రమే టిడిపి దక్కించుకోగలిగింది.
ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కూడా తెలుగుదేశం, సిపియం మిత్రపక్షాల నుంచి జారిపోయింది. జడ్పిటిసి సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరం న్యూడెమొస్రీకి చెందిన ఇద్దరు జడ్పిటిసి సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్, తెలుగుదేశం కూటముల మధ్య సరిసమాన బలాలు ఉన్నాయి. ఈ సమయంలో లాటరీ తీయక తప్పలేదు. లాటరీలో చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా కాంగ్రెస్కు చెందిన గోనె విజయలక్ష్మి గెలిచారు. వైస్ చైర్పర్సన్ పదవి కూడా కాంగ్రెస్ కూటమికే లాటరీ ద్వారా దక్కింది. వైస్ చైర్పర్సన్గా సిపిఐకి చెందిన అయోధ్యాచారి ఎన్నికయ్యారు. దీంతో తెలుగుదేశం, సిపియం కూటమిలో విషాదం అలుముకుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. వరంగల్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుల విషయంలో, మండల పరిషత్ చైర్మన్ పదవుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి ముడిపెట్టారు. దీంతో తెరాస జడ్పిటిసి సభ్యులు జిల్లా పరిషత్ సభ్యులు హాజరు కాలేదు. దాన్ని గమనించి కాంగ్రెస్ సభ్యులు కూడా గైర్హాజరయ్యారు.