వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాసను తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర: నరేంద్ర
హైదరాబాద్: తమ పార్టీని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర విమర్శించారు. ఈ కుట్రలో భాగంగానే నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్, కరీంనగర్, మెదక్ జిల్లా పరిషత్ల వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదా పడేలా చేసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తును తాము పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యుల అభ్యర్థులను కూడా కాంగ్రెస్ ఓడించిందని, ఈ విషయాన్ని తమ పార్టీ అసమ్మతి శాపససభ్యులు గుర్తించాలని ఆయన అన్నారు.
Story first published: Monday, July 10, 2006, 23:53 [IST]