వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో విమానం కూలి 45 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

ముల్తాన్‌: పాకిస్థాన్‌లో సోమవారంనాడు ఒక విమానం కూలి అందులోని 45 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలోని అందరూ మరణించారని, తాను అక్కడే ఉన్నానని పోలీసు ఛీఫ్‌ ఇఫ్తికార్‌ బాబర్‌ చెప్పారు. ముల్తాన్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన పది నిమిషాల లోపే విమానం కూలిపోయింది.

లాహోర్‌ మీదుగా ఇస్లామాబాద్‌ చేరుకోవడానికి ఈ విమానం ముల్తాన్‌ నుంచి బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 41 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది వున్నారు. మృతదేహాలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని, శకలాలు అంటుకుని మంటలు లేచాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముల్తాన్‌ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద విమానం కూలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X