వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకేటాయింపు ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పుప్పాలగుడా గ్రామంలోని భూమిని కాందిశీకులకు ఇస్తూ రెవెనూ కార్యదర్శి రోశయ్య జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు మంగళవారంనాడు సస్పెండ్‌ చేసింది. కాందిశీకులకు భూమిని అప్పగించిన కేసును హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. భూమి కేటాయింపులను ప్రభుత్వం ఇక వేలం ద్వారానే జరపాలని హైకోర్టు ఆదేశించింది.

జర్నలిస్టులకు, న్యాయమూర్తులకు, శాసనసభ్యులకు స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు నిలిపివేసింది. హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ గ్రామానికి చెందిన విలువైన భూములను కాందిశీకులకు కేటాయిస్తూ రెవెన్యూ కార్యదర్శి రోశయ్య ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో రోశయ్య ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X