వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కారు డ్రైవర్ హత్య కేసులో కోర్టుకు మొద్దు శీను
హైదరాబాద్: కారు డ్రైవర్ హత్య కేసులో జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీనును పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసును కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. నేర చరిత్రకు శ్రీకారం చుట్టిన తొలినాళ్లలో మొద్దు శీను ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
1997లో మొద్దు శీను తన మిత్రులతో సుదర్శన్ గౌడ్ అనే డ్రైవర్ వద్ద కారు మాట్లాడుకుని యాదగిరిగుట్టకు వెళ్లాడు. యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తున్న సమయంలో మొద్దు శీను సుదర్శన్ గౌడ్ను హత్య చేశారు.
Comments
Story first published: Tuesday, July 11, 2006, 23:53 [IST]