తీర్పుతో టిడిపి దివాళాకోరుతనం రుజువు: వైయస్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడా గ్రామంలోని భూమి కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ దివాళాకోరు విమర్శలు చేస్తోందనేది హైకోర్టు తీర్పు ద్వారా రుజువైందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పును తాము శిరసా వహిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రెవెన్యూ కార్యదర్శి రోశయ్యపై చర్య తీసుకునే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రభుత్వ భూములను వేలం ద్వారానే అమ్మాలనే హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను అన్ని విధాలా కాపాడుతామని ఆయన చెప్పారు. ఏమీ కాకముందే ఏదో అయిపోయినట్లు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ దివాళాకోరుతమని ఆయన విమర్శించారు. కోర్టు కేసును నీరుగారుస్తారనే విమర్శకు తెలుగుదేశం పాల్పడడం అబద్ధమని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆయన అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నామ మాత్రం ధరలకే అమ్మిన భూములను తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.