లా కోర్సుల ఫీజులు కూడా పెంపు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళన చేస్తుండగా, లా కోర్సు ఫీజులను కూడా పెంచాలని గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో విద్యార్ధుల నిరసన ఉద్యమాలు ఉద్దృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెంచిన ఇంజినీరింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతూ బుధవారం నాడు విద్యార్ధులు కౌన్సెలింగ్ను అడ్డుకోవడం, వారిపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేయడం తెలిసిందే. పోలీసుల దౌర్జన్యాన్ని విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పోలీసుల దౌర్జన్యానికి, ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్ధులు తరగతులను బహిష్కరించారు. పోలీసుల లాఠీ చార్జిపై మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఎ కేటగిరి ఫీజును 7,500కు, బి కేటగిరీ ఫీజును 25,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.