వర్జీనియాలో మణిశర్మ సంగీత మంత్రం
వాషింగ్టన్: వర్జీనియాలోని శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ నిర్మాణ, అభివృద్ధి కార్యకలాపాల కోసం తానా ఇటీవల మణిశర్మ సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని ఓకటన్ హైస్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సినిమాపాటలను మణిశర్మ బృందంలోని గాయనీ గాయకులు మల్లికార్జున్, మనోజ్బాబు, సునీత, ఉషలను, టెక్నీషియన్లు బాలాజీ, రాఘవ, చిన్న, కార్తిక్లను గాయకుడు గంగాధర్ పరిచయం చేశారు. ఈ సంగీత విభావరి దాదాపు నాలుగు గంటలపాటు విజయవంతంగా జరిగింది.
శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ కమిటీ సభ్యులు శేషాచార్యులు, సాయికాంత్ రాపర్ల దేవాలయం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులలో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు, ఆర్.టి.సి. ఛైర్మన్ గోనె ప్రకాశరావు, నాదెళ్ళ గంగాధర్, బుచ్చి రాంప్రసాద్, జయ్ తాళ్ళూరి, రవి పొట్లూరి తదితరులు ఉన్నారు.
శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ ట్రస్టీ రవి అహరం, ప్రొ॥ ముల్పూరి వెంకటరావు మణిశర్మను దుశ్శాలువతో సత్కరించారు.