వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వైఎస్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టవలసిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో గురువారం ఉదయం పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక సంస్ధలకు ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. మానవ వనరులు కూడా రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ రాష్ట్రానికి ఇచ్చిన క్రిసిల్ రేటింగ్ బాగా ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలే ఎక్కువగా హాజరయ్యారు.
Comments
Story first published: Thursday, July 13, 2006, 23:53 [IST]