వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రాన్ని 71 వేల కోట్లు అడిగిన వైఎస్
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి భారీ ఆర్థిక సహాయం పొందేందుకు, అలాగే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు న్యూఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్రెడ్డి గురువారం ప్రధాని మన్మోన్సింగ్ను కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం 71వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కోరారు. విదర్భ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని ఆయన కోరారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని చెప్పారు. అనంతరం యు.పి.ఎ. ఛైర్పర్సన్ సోనియాగాంధీని, ఆర్థికమంత్రి చిదంబరంతో కూడా సమావేశమయ్యారు.
Comments
Story first published: Thursday, July 13, 2006, 23:53 [IST]