వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టేకు నిరాకరణ
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిచంచింది. ఓటర్ల జాబితాను సవరించే వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఆపేస్తూ స్టే ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు అందుకు నిరాకరిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
గ్రామపంచాయతీ ఎన్నికలు యధావిధిగా నిర్వహించవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఓటర్ల జాబితాను సవరించాలని, ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నవారందరికీ ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఆదేశిచంంది. ఓటర్ల జాబితాల్లో అనేక అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గత ఆదివారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది.
Comments
Story first published: Friday, July 14, 2006, 23:53 [IST]