వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనకాపల్లి జడ్పిటిసి సభ్యురాలి కిడ్నాప్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ (జడ్పిటిసి) సభ్యురాలు బి. లోకేశ్వరి కిడ్నాప్నకు గురైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫర్యాదు చేశారు. అయితే ఆమెను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియడం లేదు. లోకేశ్వరి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి జడ్పిటిసి సభ్యురాలిగా గెలుపొందారు.
తాము నిన్న అర్ధరాత్రి నుంచి తమ కూతురు లేదని లోకేశ్వరి తల్లిదండ్రులు చెప్పారు. కిడ్నాప్ చేసినవారు మాత్రం ఇంట్లో చిన్న చీటి పెట్టిపోయారు. లోకేశ్వరికి ఏ విధమైన హానీ తలపెట్టబోమని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. తమ డిమాండ్ను తర్వాత తెలియజేస్తామని కూడా వారు ఆ లేఖలో తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Story first published: Tuesday, July 18, 2006, 23:53 [IST]