వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను: బాబు
చెన్నై: తాను రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం బుధవారం చెన్నై వచ్చారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు, పార్టీ నాయకుడు రామకృష్ణా రెడ్డిని ఆయన పరామర్శించారు. రామకృష్ణా రెడ్డి కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
తన సహరుడు తాను రామకృష్ణారెడ్డిని పరామర్శించానని చంద్రబాబునాయుడు అన్నారు. రామకృష్ణా రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాల గురించి మీడియా ప్రతినిధులకు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. తాను వ్యక్తిగత పర్యటన నిమిత్తం వచ్చానని, రాజకీయాలు మాట్లాడబోనని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, July 19, 2006, 23:53 [IST]