వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎయిమ్స్కు బాంబు బెదిరింపు: సోదాలు
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్)కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిమ్స్ ఆవరణలో బాంబు ఉన్నట్లు ఆగంతకుల నుంచి ఫోన్ రావడంతో పెద్ద యెత్తున సోదా జరిగింది. బాంబు స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు చేశారు. శునకాలతో కూడా ఈ సోదాలు జరిగాయి. ఫైర్ ఇంజన్లను, అంబులెన్స్లను సంస్థగా వద్ద సిద్ధంగా వుంచారు. ఎయిమ్స్లో బాంబు వున్నట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది.
Comments
Story first published: Wednesday, July 19, 2006, 23:53 [IST]