వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీచక కమీషనర్‌ సస్పెన్షన్‌కు ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కీచక అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళా ప్రభుత్వోద్యోగులు బుధవారం ధర్నా చేశారు. ఉపాధి, శిక్షణా శాఖ కమీషనర్‌ మంగపతిరావు ఒక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారు ఈ ధర్నాకు దిగారు. ఉష అనే మహిళా ఉద్యోగి పట్ల మంగపతిరావు అసభ్యంగా ప్రవర్తించారని, ఈ సమయంలో ఇతర అధికారులు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఒక తెలుగు దినపత్రిక బయట పెట్టింది.

మంగపతిరావుపై ఉష రెండు రోజుల క్రితం కార్మిక శాఖ మంత్రి జి. వినోద్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దివాన్‌కు ఫిర్యాదు చేశారు. దివాన్‌కు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వినోద్‌ విచారణకు ఆదేశించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. మంగపతిరావును తొలగించాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. గత మూడు నెలలుగా తనను మంగపతిరావు వేధిస్తున్నారని ఉష అంటున్నారు. అయితే అదేం లేదని మంగపతిరావు బుకాయిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X