వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: పెద్దలు అంగీకరించకపోవడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రసాదరావు, శ్రీలత అనే ప్రేమికుల శవాలు నల్లగొండ జిల్లా దేవరకొండలోని తులసమ్మ కోట తోటలో పక్కపక్కనే పడి వున్నాయి. వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బతికి వున్నప్పుడు కలిసి వుండడానికి ఇష్టపోడకపోయినా మరణించిన తర్వాతనైనా కలిసి వుండేలా పక్కనే పక్కనే తమ శవాలను పూడ్చాలని ఆ ప్రేమికుల జంట లేఖ రాసి పెట్టింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రసాదరావు అనే యువకుడు నల్లగొండ జిల్లా దేవరకొండలో డిగ్రీ చదివాడు. అదే సమయంలో శ్రీలత అమ్మాయితో పరిచయమై ప్రేమగా మారింది. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు ఆ పెళ్లికి అంగీకరించలేదు. దాంతో ప్రేమికులిద్దరూ పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఏ విధంగానూ అంగీకరించరనే బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X