వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురి హత్య
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు. వీరు నెల్లూరు జిల్లా తాపీపనివారు. వీరు 20 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. గురవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దొంగల దాడిలో మేస్త్రీ లక్ష్మారెడ్డి, ఆయన కుమారుడు వెంకటరమణారెడ్డి, బంధువుల వెంకట్ మరణించారు. మేస్త్రీ భార్య ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడినవారి ఆచూకీ తీయడానికి హైదరాబాద్ నుంచి డాగ్ స్క్వాడ్స్ను రప్పించినట్లు పోలీసులు చెప్పారు. దుండగులు పోతూ పోతూ మరో ఇంటిపై, ఒక డాబాపై దాడి చేసినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Friday, July 21, 2006, 23:53 [IST]