వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేలం పాటల కేంద్రంగా ప్రభుత్వం: సిపియం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటల కేంద్రంగా మారిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూముల వేలంపాటలను ఉద్దేశించి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం భూములను వేలం వేయడం దివాళాకోరుతనం అని ఆయన అన్నారు.
జలయజ్ఞంలో పెద్ద చేపలను వదిలేసి ప్రభుత్వం చిన్న చేపలపై పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ కింది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుందే ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా అని ఆయన అడిగారు. కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం, నీటిపారుదల శాఖ కుంభకర్ణుడి నిద్రపోతున్నాయా అని ఆయన ప్రశ్నించారు.
Comments
Story first published: Friday, July 21, 2006, 23:53 [IST]