వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతి సూచనలను తోసిపుచ్చిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన లాభదాయక పదవుల బిల్లును కేంద్ర ప్రభుత్వం యధాతధంగా ఆమోదించింది. రాష్ట్రపతి అబ్దుల్కలాం ఈ బిల్లును తిరిగి పరిశీలించవలసిందిగా తిప్పి పంపగా కేంద్ర కేబినెట్ శనివారం ఉదయం దీనిలో ఎటువంటి మార్పులు చేయకుండా ఆమోదించి తిరిగి రాష్ట్రపతికి పంపడం విశేషం. తాము రూపొందించిన బిల్లు సరిగానే ఉందని కేంద్రమంత్రివర్గం అభిప్రాయపడింది. రాష్ట్రపతి సూచనలను మంత్రివర్గం పక్కన బెట్టి బిల్లును యధాతధంగా ఆమోదించింది. ఈ బిల్లుపై గతంలో తీవ్ర స్ధాయిలో వాదోపవాదాలు జరిగాయి. యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జయాబచ్చన్ తదితరులు రాజీనామాలు చేయవలసి వచ్చింది.
Comments
Story first published: Saturday, July 22, 2006, 23:53 [IST]