వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హురియత్ నాయకుడు జిలానీ గృహ నిర్బంధం
శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయ్యద్ అలి జిలానిని శనివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. లెబనాన్, పాలస్తీనాపై ఇజ్రేల్ దాడులకు నిరసనగా జిలాని నేడు జమ్ము, కాశ్మీర్ బంద్కు పిలువు ఇచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతల రీత్యా పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు దీన్ని అమలు చేస్తున్నారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళాలు ఆయన ఇంటి ముందు మొహరించి ఉన్నాయి. ఆయన్ను బయటకు రావద్దని పోలీసులు కోరారు. ఇదిలా ఉంటే శ్రీనగర్తో పాటు ఇతర పట్టణాల్లో సాధరణ జన జీవనం స్థంబించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు బంద్ రీత్యా మూసివేయబడి ఉండగా, రోడ్డుపై ట్రాఫిక్ కూడా పలుచగా ఉంది.
Comments
Story first published: Saturday, July 22, 2006, 23:53 [IST]