వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో నాటుబాంబులు స్వాధీనం
గుంటూరు: గుంటూరు జిల్లా ఇక్కూరు గ్రామంలో పోలీసులు భారీ యెత్తున నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కూరు గ్రామంలోని గడ్డివాములో రెండు బకెట్లలో దాచిన నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గడ్డివాము తెలుగుదేశం పార్టీకి చెందిన కామినేని వీరయ్యది.
ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇక్కూరులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలింగ్ వాయిదా పడి రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం బయటపడిన బాంబులు ఆ సమయంలో దాచి పెట్టినవే అయి వుండవచ్చునని పోలీసులు అంటున్నారు.
Story first published: Sunday, July 23, 2006, 23:53 [IST]