వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ను చంపడం లక్ష్యం కాదు: డిజిపి
హైదరాబాద్: నక్సల్స్ను చంపడం తమ లక్ష్యం కాదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. బోనాల జాతర సందర్భంగా ఆయన ఆదివారంనాడు ఒక దేవాయలంలో అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నక్సల్స్ హింసకు స్వస్తి చెప్పి తుపాకులు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన సూచించారు. నక్సల్స్ రాజకీయ జీవనంలోకి రావాలని ఆయన అన్నారు. నల్లమల అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, కొందరు మరణించారని తనకు తెలిసిందని ఆయన అన్నారు. ఎన్కౌంటర్లో ఎవరు మరణించింది ఇప్పుడే తనకు తెలియదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, July 23, 2006, 23:53 [IST]